Ticker

6/recent/ticker-posts

NRA అంటే ఏమిటి? ఎన్‌ఆర్‌ఏ ముఖ్యాంశాలు

ఉద్యోగ నియామకాలకు జాతీయ సంస్థ ఏర్పాటు


🌀ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ ప్రాథమిక పరీక్షల బాధ్యత ఎన్‌ఆర్‌ఏదే


🍥సాధించిన స్కోర్‌ మూడేళ్లపాటు చెల్లుబాటు


🌀కేంద్ర కేబినెట్‌ ఆమోదం




🌍కోట్ల మందికి వరం


🍥జాతీయ నియామక సంస్థ ఏర్పాటు వల్ల కోట్ల మంది యువతకు మేలు కలుగుతుంది. ఎందుకంటే వారు ఉద్యోగాల కోసం వేర్వేరు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. విలువైన సమయం, ఇతర వనరులు ఆదా అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది.


- 🎙️ప్రధానమంత్రి నరేంద్రమోదీ


 

దిల్లీ: 🌍కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఎన్డీయే సర్కారు నడుం బిగించింది. ఒకే దేశం- ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం ‘జాతీయ నియామకాల సంస్థ’ (నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ- ఎన్‌ఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. రైల్వే, బ్యాంకింగ్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింద వేర్వేరుగా భర్తీచేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. దశలవారీగా ఈ సంస్థలను పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. ‘స్వతంత్ర భారతదేశంలో ఇదో విప్లవాత్మక సంస్కరణ. ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగత ఆసక్తితోనే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.



1️⃣ఒకే గూటి కిందికి..


🌀ఎన్‌ఆర్‌ఏ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.


🌍దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున సుమారు వెయ్యి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.


🌀ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్‌ మూడేళ్లు చెల్లుబాటవుతుంది.


🍥స్కోర్‌ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీమళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్‌నే పరిగణనలో తీసుకుంటారు.


🌻ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.


🍥వేర్వేరు రుసుములతో అనేకసార్లు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు.


🍥ఏటా మూడు కోట్ల మంది


🌀రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ), స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), ఐబీపీఎస్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌) కింద ఏటా 1.25 లక్షల గ్రూప్‌-బి, సి ఉద్యోగాల ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటికి దాదాపు 3 కోట్ల మంది హాజరవుతుంటారు.


🌻ఖాళీల భర్తీకి 12-18 నెలల సమయం పట్టేది.


📝నియామక పరీక్షల్లో ఒక అంచె తగ్గించడానికి ఈ మూడు సంస్థలకు కలిపి ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహిస్తారు.


🌀దీనిలో స్కోర్‌ ఆధారంగా ఇవి తదుపరి పరీక్షలను వేర్వేరుగా నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు.


పది, ఇంటర్‌, డిగ్రీ స్థాయుల్లో🔰


🌀పదో తరగతి, ఇంటర్మీడియేట్‌, డిగ్రీ అర్హతల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.


🍥గరిష్ఠ వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా అభ్యర్థులు వీటిని రాయవచ్చు.


🍥ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.


🌀అభ్యర్థుల స్కోర్లు ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగా అవి నియామకాలు చేపట్టవచ్చు.


🍥రెండో దశ పరీక్ష అవసరం లేకుండా మొదటి దశలోని స్కోరు, వైద్య పరీక్షల ఆధారంగానే నియామకాలు చేసుకుంటామని కొన్ని సంస్థలు సూచనప్రాయంగా చెప్పడం అభ్యర్థులకు మరింత ఊరటగా ప్రభుత్వం పేర్కొంది.






🍥ఎన్‌ఆర్‌ఏ ముఖ్యాంశాలు


🍥ఎన్‌ఆర్‌ఏను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేస్తారు. ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. పాలకమండలిలో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.


🌼తొలి మూడేళ్లలో నిర్వహణకు ఖర్చు: రూ.1,517.57 కోట్లు


🍥నూతన విధానం వల్ల తుది పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య 5 శాతానికి పరిమితం అవుతుంది.


🌀తొలిదశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. తక్షణం స్కోర్‌ లభిస్తుంది. దాని ఆధారంగా అభ్యర్థి ఈ మూడు బోర్డుల్లోని ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని, దానికి అవసరమైన తదుపరి దశ పరీక్ష రాయొచ్చు.


🌀ప్రస్తుతం ఈ ఏజెన్సీ పరిధిని 3 నియామక బోర్డులకే వర్తింపజేస్తున్నారు. అంతా గాడిన పడుతున్నకొద్దీ కేంద్రంలోని 20 నియామక సంస్థలనూ దీని పరిధిలోకి తీసుకువస్తారు.


📚ఒకే సిలబస్‌




📚అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్‌ ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు.


★ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట ఒకటికి మించి నెలకొల్పుతారు. గ్రామీణ అభ్యర్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత జిల్లాలోనే పరీక్ష రాయడానికి వీలవుతుంది.


★పరీక్షలు తొలుత 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంవల్ల కేంద్ర ఉద్యోగాల్లో అన్ని భాషలవారి ప్రాతినిధ్యం పెరుగుతుంది.


★ఉమ్మడి రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా అభ్యర్థులు తమకు సమీపంలోని కేంద్రాలను ఎంచుకోవచ్చు.


★ఒకే క్వశ్చన్‌ బ్యాంకు ఉంటుంది. సురక్షితమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రీయంగా సర్వర్‌ను నిర్వహిస్తారు.


★117 ఆకాంక్షిత జిల్లాల నుంచి ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచడానికి ప్రత్యేక చేయూతనందిస్తారు. అక్కడి వారికి అవసరమైన సాయం చేయడానికి 24 గంటల హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేస్తారు. ఈ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలకు అవసరమైన వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘వ్యయ సర్దుబాటు నిధి’ ఇస్తుంది.