Ticker

6/recent/ticker-posts

5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 1)


5వ తరగతి మనం - మన పరిసరాలు (భాగం - 1)
1. జంతువులు - మన జీవనాధారం
మన పూర్వీకులు అడవులలో నివసించేవారు. జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం.



వారి ఆహారం, రక్షణ, రవాణా కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు.
జంతువులు - అవసరాలు
రవాణా కోసం - గుర్రం, ఒంటె, గాడిద
జీవనోపాధి కోసం - రామచిలుక, కోతి
వ్యవసాయం కోసం - ఎద్దు
పెళ్లిళ్ల కోసం - గుర్రం, ఏనుగు
వినియోగ వస్తువుల కోసం - పాము, జింక, పులి, తాబేలు, గొర్రె
వినోదం కోసం - కోతి

రక్షణ కోసం - కుక్క




ఆహారం కోసం - కోడి, మేక

లింగయ్య గొర్రెలు మేపుతూ రోజుకి 30 కి.మీ. నడుస్తాడు.
గొర్రెల కాపరులు పదిమంది వరకు గుంపుగా వెళతారు. బరువులు మోయడానికి గాడిదను తీసుకువెళతారు.
గొర్రెల పై చిరుతపులులు, తోడేళ్ళు వంటివి దాడి చేస్తాయి. కుక్కలు కొంతవరకు వీటిని కాపాడతాయి. రాత్రి వేళ పాము భయం ఉంటుంది.
గొర్రెల కాపరులు వద్ద ఉండే సామాగ్రి - తోలు చెప్పులు, ఊలు గొంగళి, కర్ర, మంచినీటి బుర్ర
రైతు మిత్రులు :
వానపాము - భూమిలో వ్యర్ధపదార్ధాలు తింటుంది. నేల గుల్లబారేలా చేస్తుంది.

సాలెపురుగు - పంట నాశనం చేసే పురుగులు, దోమలు దీని గూటిలో చిక్కుకుంటాయి.




చీమ - మొక్కలపై ఉన్న చిన్న పురుగుల గుడ్లు తిని పంట కాపాడును.
పాము - పంటపొలాల్ని, ధాన్యపు కంకులని తిని నాశనం చేసే ఎలుకలని తింటుంది
టైకోగ్రామ - దీనిని "జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ. సి.ఎ. ఆర్)" శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. జీవితకాలం ఏడు రోజులు. శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది
విసనకర్ర - గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో వీటిని తయారుచేస్తారు
కాకినాడలో ఎద్దుకొమ్ములతో గుండీలు తయారుచేసే పరిశ్రమలు 39 దాకా ఉన్నాయి.
దంతాల కోసం ఏనుగులు, చర్మం కోసం పులి, జింకలు చంపుతున్నారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 - షెడ్యూల్ (1) ప్రకారం పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులుని వేటాడడం, విక్రయించడం నేరం.

ఈ నేరానికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు వరకు జరిమానా.




మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే మేలు జాతిగా గుర్తింపు పొందాయి. పొట్టికొమ్ములు, అందమైన మూపురం, గంగడోలు కలిగి రెండు మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి.
ఒంగోలు జాతి గిత్తలు మన వ్యవసాయానికి వెన్నెముక వంటివి.
బ్రెజిల్ దేశం వాళ్ళు వీటిని అభివృద్ధి పరచి ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్ లో ఒంగోలు ఆవులు 40 లీ వరకు పాలు ఇస్తున్నాయి. బ్రెజిల్ నుండి వీటిని తేవాలంటే 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
భూమిపై అసలు మనిషంటూ లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవ జాతి నశిస్తుండేది.
నేడు ప్రతీ 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది.
భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో కనిపించే పులి "రాయల్ బెంగాల్ టైగర్"
బట్టమేక పక్షులు, కలివికోడి, ఉంగనూరు ఆవులు సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉంది
రాబందు - గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి కనిపించడం లేదు. వీటి ఆచూకీ తెలిపినవారికి రెండు లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించారు.

కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి - గౌతమ బుద్ధుడు




2. వ్యవసాయం - పంటలు
వ్యవసాయం అంటే పంటలు పండించడం. 
గతంలో రైతులు తాము వేసిన పంట నుండి మేలు రకం గింజలు విత్తనాల కొరకు భద్రపరిచేవారు. ఇప్పుడు అంతా మార్కెట్ పై ఆధారపడుతున్నారు.
గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు పేరిట విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చాక తిరిగి ఇచ్చేవారు. ఈ పద్దతిని "నాగులు" అన్నారు.
మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 వంకాయ వంగడాలు ఉండేవి
మొక్కల జన్యువులు భద్రపరిచే సంస్థ - నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్
ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం - అంతర పంటలు
వానపాముల సాయంతో వర్మికంపోస్టు తయారుచేస్తారు.
పంచగవ్య - ద్రవరూప ఎరువు - ఆవుమూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరినీళ్లు, బెల్లం, నీరు కలిపి తయారుచేస్తారు. ఇది "సూక్ష్మజీవనాశిని"
జీవామృతం - ఆవుమూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాలు పొడి, నీరు కలిపి చేస్తారు. ఇది "సూక్ష్మజీవులు వృద్ధి" చేసేది.



గుడ్ల కోసం పెంచే కోళ్లు - లేయర్లు, మాంసం కోసం బ్రాయిలర్
తోగాళ్ళు - కంది, తయిదలు - రాగులు, బొబ్బర్లు - అలసందలు
దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
పండ్లు, కూరగాయలు పై గల పురుగుల మందులు పోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
సాంప్రదాయ, సేంద్రియ పురుగుల మందులు అనగా మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కాషాయం, వావిలాకు కాషాయం, పంచగవ్య మొదలైనవి పంటల పై అవసరం మేర చల్లాలి.
రసాయన ఎరువులు, పురుగుల మందులు వల్ల భూసారం తగ్గుతుంది.
వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెధాన్యాలు, కూరగాయలు, పళ్ళు మొదలైనవి - ఆహార పంటలు
పత్తి, జనుము, మిర్చి వంటివి - వాణిజ్య పంటలు
జొన్న - పచ్చ జొన్న, తెల్ల జొన్న



వరి - IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారుతీగ, సాంబ
కంది - ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి
వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. కంది పంటకు 6 నెలలు పడుతుంది.
వరికి ఎక్కువ నీరు అవసరం, జొన్న, శనగలకి తక్కువ నీరు అవసరం.
జొన్న, శనగ వంటి పంటలను "ఆరుతడి పంటలు / వర్షాధార పంటలు" అంటారు.
రాష్ట్రంలో పంటలు పండే ప్రాంతాలు
వరి - all Andhra Pradesh
జొన్న - తూ.గో
పత్తి - గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం, 
మిరప - గుంటూరు, నెల్లూరు
మామిడి - తూ.గో, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూర్
కొబ్బరి - తూ.గో, ప.గో
గోధుమ - తూ.గో
మొక్కజొన్న - తూ.గో, గుంటూరు



3. మనం చెట్లను పెంచుదాం!
అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 33% ఉండాలి. మన దేశంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి.
మొక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి, సారవంతమైన నేల అవసరం
మొక్కలు - ఉత్పత్తిదారులు
మేడలపై పచ్చదనంతో నగర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంటి పైకప్పు చల్లగా ఉంటుంది.
పెద్దవిగా పెరిగే చెట్లు చిన్న కుండీలలో పెంచడాన్ని "బోన్సాయ్(వామన వృక్షాలు)" అని అంటారు. ఇది జపాన్ దేశ సాంప్రదాయ కళ.
వేరొక చెట్టు నీడలో నాటితే మొక్క పెరగదు.



డాంబరు పూసిన కర్రకి చెదలు పట్టవు.
చెట్టుకి చీడ పట్టినపుడు వేప పిండిని నీటిలో అయిదు రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకి చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది
మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతి పిల్లలకి అందించడం వంటి అంశాలు పిల్ల, పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ - కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్
ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా చేపట్టిన ఉద్యమం "వన ప్రేరణ ఉద్యమం". దీనిలో భాగంగా 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు.
ఇటీవల హరిత పాఠశాల అవార్డ్ పొందిన పాఠశాల - గడ్డంపల్లి (మహబూబ్ నగర్ జిల్లా, తెలకపల్లి మండలం)
పర్యావరణం పచ్చదనంతో నింపడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తో పాటు వందేమాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలైన సంస్థలు కృషి చేస్తున్నాయి.
నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యాలు - పాఠశాల పచ్చదనంతో నింపడం, పర్యావరణ పరిరక్షణ, పని అనుభవం ద్వారా పచ్చదనం ఆస్వాదించడం, శ్రమ విలువ గుర్తించడం, వాతావరణ కాలుష్యం గుర్తించడం, గ్రామస్థులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం.
నగరాల్లో 67% జనాభా నివసిస్తున్నారు.
కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది - వేప చెట్టు
4. పౌష్టికాహారం
వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, తాయిదలు(రాగులు), సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు.




చిరుధాన్యాలలో పిండిపదార్ధాలు అధికంగా ఉంటాయి. శక్తినిచ్చే ఆహారపదార్ధాలు - పిండిపదార్ధాలు
అలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప వంటి పండ్లలో శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె వంటి వాటిలో ఎక్కువ కొవ్వు పదార్ధాలు ఉంటాయి.
కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరం అయినప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది.
శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠాణీలు, చిక్కుడు గింజలు మొదలైనవి పప్పు ధాన్యాలు. పప్పుధాన్యాలలో ప్రోటీన్లు ఉంటాయి.
కొత్త కణాలు పుట్టడంలో గాయాలు మాన్పడంలో ప్రోటీన్లు(మాంసకృతులు) ఉపయోగపడతాయి.
అయోడీన్, పాస్ఫరస్, కాల్షియమ్, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి.
రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియమ్, పాస్ఫరస్ ఉంటాయి.
విటమిన్లు, ఖనిజలవణాలు తక్కువ పరిమాణంలో అవసరం
టొమాటో :
1.08 గ్రా. ప్రోటీన్, 1.5 గ్రా. ఫైబర్ ఉంటాయి. పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీసియం, సోడియం వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ A, B2, B6, E, K లు ఉంటాయి.
ఒక టమాటో నుండి "22 కేలరీలు" శక్తి లభిస్తుంది

శక్తినిచ్చేవి, పెరుగుదలకు తోడ్పడేవి పదార్ధాలు రెండింటిని తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతాయి. పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది. - (క్వషియార్కర్)




మనం తినే ఆహారంలో శక్తినిచ్చేవి (పిండిపదార్ధాలు, కొవ్వులు, నూనెలు), పెరుగుదలకు (ప్రోటీన్లు), ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధకత (విటమిన్లు, ఖనిజలవణాలు) పదార్ధాలు తప్పనిసరిగా ఉండాలి.
జంక్ ఫుడ్ లో సాధారణంగా కేలరీలు మాత్రమే ఉంటాయి
.


మన శరీర భాగాలు - జ్ఞానేంద్రియాలు
పనులు చేయడానికి మనం ఒకటి కంటే ఎక్కువ అవయవాలు ఉపయోగిస్తాం. అప్పుడు అవయవాల మధ్య సమన్వయం అవసరం అవుతుంది.
జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం - వీటి ద్వారా వివిధ విషయాలకు చెందిన జ్ఞానం తెలుస్తుంది.
చదివినప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన దూరం - 30 సెం. మీ. టి.వి చూసినపుడు రెండున్నర మీటర్ల దూరం నుండి చూడాలి.
కంటి వైద్యం చేసే డాక్టర్ - ఆప్తమాలజిస్ట్ 
ఒక వ్యక్తికి పుట్టుక నుండి చెవులు వినపడకపోతే అతనికి మాట్లాడడం రాదు.
మాటలు రానివారికి గుర్తులు, సైగలతో విషయాలు తెలియజేస్తారు. దీనిని "షైన్ లాంగ్వేజ్" అంటారు.



వినలేని స్థాయిలో పెద్ద శబ్దాలు చేసినప్పుడు ధ్వని కాలుష్యం అవుతుంది.
చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు వైద్యం చేసే డాక్టర్ - ENT నిపుణులు
గబ్బిలం రాత్రి పూట సంచరిస్తుంది. అది తన దారిలో అడ్డంకులను శబ్దాలు ద్వారా గ్రహిస్తుంది.
ముక్కు ద్వారా గాలి పీల్చడం, వదలడం - శ్వాసించడం
లోపలికి పీల్చుకోవడం - ఉచ్వ్వాసం, బయటకు వదలడం - నిశ్వాసం
నాలుక మాట్లాడడానికి, ఆహారం మింగడానికి రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడును.
నాలుకపై రుచిమొగ్గలు రుచి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఆహారపదార్ధాలు నమిలినపుడు లాలాజలంతో కలసి రుచి ఏర్పడుతుంది.
దంతాలు : కొరకు దంతం, కోర దంతం, నములు దంతం, విసురు దంతం - దంతసూత్రం - 2123/2123
దంతాలు ఆహారం నమలడానికి, మాట్లాడడానికి ఉపయోగపడును. చిన్న పిల్లలకు మొదటగా వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు.
దంతాలు శుభ్రం చేసుకోకపోతే సూక్ష్మజీవులు చేరి  హాని చేసే ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల దంతాలు పసుపు, నలుపు రంగులలో మారతాయి.
ఇటుకపొడి, బొగ్గు వంటి గరుకు పదార్ధాలు దంతాలు శుభ్రం చేయడానికి వాడరాదు. దీని వల్ల దంతాల పై ఏనామిల్ పొర దెబ్బ తింటుంది.
చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతుంది.
చర్మ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ - డెర్మటాలజిస్ట్
శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. మానవ చర్మం బరువు దాదాపు 4 కిలోలు ఉంటుంది. 1 1/2 చ.మీ. వైశాల్యం ఉంటుంది.
పరిసరాలలో మార్పులకు మొదటగా ప్రభావితం అయ్యేది చర్మం



అరచేతి వేళ్ళ చర్మం పై ఉండే ఎత్తు పల్లల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి.
6. మన శరీరంలోని వ్యవస్థలు
శ్వాసవ్యవస్థ :
శ్వాస అవయవాల ద్వారా మన శరీరం గాలిలో ఆక్సిజన్ గ్రహిస్తుంది. 
శ్వాస వ్యవస్థలో ముక్కు, శ్వాస నాళం, ఊపిరితిత్తులు ఉంటాయి.
ముక్కు - శ్వాసనాళం - ఊపిరితిత్తులు
ముక్కు రంద్రంలో తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి.
ఊపిరితిత్తులలో గాలిగాదులు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి.
గాలిగాదులు కుడ్యం పై సూక్ష్మ రక్త నాలికలు ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ గ్రహించి రక్తం ద్వారా శరీరభాగలకు పంపుతాయి. రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరిని బయటకు పంపుతాయి.
ఊపిరితిత్తుల వ్యాధికి వైద్యం చేసే డాక్టర్ - పల్మానాలజిస్ట్ 
రక్త ప్రసరణ వ్యవస్థ :
శరీర ఉష్ణోగ్రత క్రమబద్దీకరించడానికి రోగకారకాలపై పోరాటం చేయడానికి రక్తం ఉపయోగపడుతుంది.
రక్తంలో ఎక్కువ ద్రవరూప "ప్లాస్మా" ఉంటుంది. మూడు రకాల రక్త కణాలుంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు
ఎర్ర రక్త కణాలు - శరీర కణాలను ఆక్సిజన్ అందిస్తాయి.
తెల్ల రక్త కణాలు - రోగ కారక క్రిములతో పోరాడతాయి.
రక్త ఫలకికలు - రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి.
గుండె వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ - కార్డియాలజిస్ట్ (హృద్రోగ నిపుణులు)



మన గుండె మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమవైపు , 1/3 వంతు కుడివైపు ఉంటుంది. గుండె రక్తాన్ని పంపు చేస్తుంది.
పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
ఆస్థిపంజర వ్యవస్థ :
మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి.
అస్థిపంజరం శరీరానికి ఆకారం, ఆధారం ఇస్తుంది. తలలో ఎముకల చట్రం - పుర్రె
మెడ నుండి నడుము వరకు చిన్న ఎముకలుతో వెన్నెముక ఉంటుంది.
కాల్షియమ్ ఎముకలను దృడంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలలో కాల్షియమ్ ఎక్కువ ఉంటుంది.
శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది.
ఎముకల సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ - అర్ధోపెడిషియన్
జీర్ణ వ్యవస్థ :
ఘన, ద్రవ రూపాల్లో ఉండే పదార్ధాలు చివరకు రక్తంలో కలిసేలా చాలా సరళ ద్రవాలుగా మారుతాయి. ఈ ప్రక్రియ నోటితో మొదలవుతుంది
కడుపు కిటికీ (డాక్టర్ బీమాంట్ ప్రయోగం) :
1822 లో మార్టిన్ అనే సైనికుడికి బీమాంట్ వైద్యం చేయవలసి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సం.
మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు.



ఆహార పదార్థాలు
జీర్ణం కావడానికి పట్టే సమయం 

కడుపులో 
జీర్ణ రసాలున్న గ్లాసులో 
మరిగించని పాలు 
2 గం. 15 ని. 
4 గం. 45 ని. 
మరిగించిన పాలు 
2 గం. 
4 గం. 15 ని. 
పూర్తిగా ఉడికిన గుడ్డు 
3 గం. 30 ని. 
8 గం. 
సగం ఉడికిన గుడ్డు 
3 గం. 
6 గం. 30 ని. 
చిలకబడ్డ పచ్చి గుడ్డు 
2 గం. 
4 గం. 15 ని.

  పచ్చి గుడ్డు                                        1 గం. 30 ని. 4 గం.

ఈ గ్లాస్ ని సుమారు 300  వద్ద ఉంచారు.




టమాటా :
నోటిలో ముక్కలవుతుంది. లాలాజలంతో కలుస్తుంది. 5 - 30 సెకన్ల సమయం
ఆహార నాళం నుండి కడుపులోకి - 10 - 15 సెకన్లు
కడుపులో జీర్ణరసాలతో కలుస్తుంది - 3 - 5 గంటలు
చిన్న ప్రేగు - 3 - 4 గంటలు
జీర్ణం కాని ఆహారం పెద్దప్రేగులోకి వెళ్తుంది. పెద్దప్రేగులో - 8 గంటల నుండి 3 రోజులు

పొట్ట 25% మేర ఖాళీ ఉండాలి.




విసర్జక వ్యవస్థ :
వెన్నెమూకకు ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి మలినాలను వేరు చేస్తాయి.
చర్మం ఒక విసర్జక అవయవం. చెమట రూపంలో మలినాలను బయటకు పంపుతుంది.
మూత్రపిండ వ్యవస్థకు చికిత్స చేసే డాక్టర్ - యూరాలజిస్ట్
నాడీ వ్యవస్థ :
నాడులు జ్ఞానేంద్రియాలు ద్వారా పొందిన సమాచారం మెదడుకి పంపుతాయి. మెదడు విశ్లేషించి అవసరం అయిన సూచనలు నాడులు ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది.
నాడులు సంబంధ చికిత్స చేసే డాక్టర్ - న్యూరాలజిస్ట్
7. అడవులు - గిరిజనులు
అరకు ప్రాంత గిరిజనుల ప్రత్యేక నృత్యం - థింసా
గోండు జాతి గిరిజనులు ఆదిలాబాద్ లో ఉంటారు. 
వీరి గుడిసెలు సాధారణంగా రాళ్లతో కట్టిన గోడలకు మందంగా నునుపుగా మట్టి పూసి ఉంటారు.



మహిళలు నేల మీద గోడల మీద ప్రత్యేక పద్దతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు.
గోండుల గ్రామదేవత "అకిపెన్"
గోండుల ముఖ్యమైన జాతర "నాగోబా జాతర". నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉంది.
నాగోబా జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.
గోండుల సాంప్రదాయ నృత్యం - గుస్సాడీ
మన రాష్ట్రంలో "చెంచులు" నల్లమల అడవులలో నివసిస్తున్నారు. ముఖ్యంగా కర్నూల్, గుంటూరు, ప్రకాశం, తెలంగాణలో మహబూబ్ నగర్ లో ఎక్కువ ఉంటారు.
వీరు మాట్లాడే భాష చెంచు భాష
తేనె సేకరించడం చెంచులకి తెలిసినట్లు వేరేవారికి తెలీదు.
చెంచులు డబ్బు, ఆడంబర వస్తువులపై ఆసక్తి చూపరు.
చెంచు గుడిసెలు "పెంటలు" అంటారు. కొన్ని పెంటలు కలిపి గ్రామం.
గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు. అతనిని "పెద్ద మనిషి" అంటారు.
వీరు పూజలో "లింగయ్య స్వామి, చెంచులక్ష్మి" పూజ ముఖ్యమైనది. ఈ పూజలు మాఘమాసంలో నిర్వహిస్తారు.
బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బు అంటే ఏమిటో తెలీకుండా జీవించే గిరిజనులు - బోండా జాతి
బోండా గిరిజనులు విశాఖలో అరకు, ఒడిశాలో మల్కాజ్ గిరి జిల్లాలో ఉంటారు. వీరిని బోండా, పోరోజు అని అంటారు.
వీళ్ళు మాట్లాడే భాష - రెమో



మన దేశంలో బోండా తెగ జనాభా 12,000 మాత్రమే.
వారం వారం జరిగే వీరి సంతలను "హతా" అంటారు.
వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తారు.
వీళ్ళు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి బదులుగా వారికి అవసరం అయిన వస్తువులు తీసుకుంటారు. దీనిని "బినిమయ్ ప్రోదా" అంటారు.
వీరు జనపనార బట్టలు వేసుకుంటారు
జనపనార 2-3 రోజులు నానబెట్టి వాటి నుండి దారాలు తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు.
జనపనార సేకరణ - నీటిలో నానబెట్టడం - దారాలు తీయడం - మగ్గాలలో నేయడం - రంగులు రుద్దడం - ఎండలో ఆరబెట్టడం - అద్దాలు కుట్టడం
వెదురు, యూకలిప్తస్, సుబాబుల్ చెట్ల నుండి కాగితం తయారవుతుంది.
మన రాష్ట్రంలో తూ.గో., ప.గో., విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో అడవులు ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో గోండు, కోలామి, ప్రధాన్, తోటి తెగ గిరిజనులు ఉన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అడవులలో సవర, ఆదివాసీ, ఒరియా, కువి, గదబ తెగల వాళ్ళున్నారు.
తూ.గో., ప.గో. జిల్లాల అడవులలో కోయ తెగ గిరిజనులు ఉన్నారు.



మన దేశ అడవులు - 6,92,027 చ.కి.మీ.(21%). మధ్య ప్రదేశ్ 77,000 చ.కి.మీ లతో మొదటి స్థానం.
మన రాష్ట్ర మొత్తం భూభాగంలో అడవులు 46,389 చ.కి.మీ.(16.89%).
అటవీ విస్తీర్ణంలో మొదట స్థానం ఖమ్మం (43.23%)
కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ అయితే భూమి వేడెక్కును. దీనిని భూగోళం వేడెక్కడం అంటారు. దీని వల్ల వర్షాలు తగ్గుతాయి.
8. నది - జీవన విధానం
గోదావరి నది జన్మ స్థలం - నాశిక్ జిల్లా త్రయంబకం (పచ్చిమ కనుమలలో బ్రహ్మగిరి కొండలు)
ఆదిలాబాద్ జిల్లా బాసరలో ప్రవేశించింది. సుమారు 1465 కి.మీ. ప్రవహిస్తుంది.
తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఆంధ్ర ప్రదేశ్ లో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవహిస్తుంది.
తూ.గో లోని అంతర్వేది యానాం వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
పులస చేప - ఇది ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించే అరుదైన చేప
పులస శాస్ట్రియనామం - హిల్సా హిలీసా.
ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లో 1200 కి.మీ ప్రయాణించి గోదావరి జలాల్లో గుడ్లు పెట్టడానికి వస్తాయి.
పులస చేపలో "ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు" సమృద్ధిగా ఉంటాయి.
పాపికొండలు రాజమండ్రి భద్రాచలం మధ్య ఉన్నాయి.
గోదావరి నదిపై మొదటి డ్యామ్ - గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబకం పట్టణాలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్యాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి.
వరంగల్ జిల్లా ఎత్తిపోతల పధకం ద్వారా వరంగల్, కరీంనగర్, నల్గొండ పట్టణాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
గోదావరి నీటితో మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లో చెరకు, వరి, పత్తి, పొగాకు, మిరప, పండ్ల తోటలు పండుతున్నాయి.
గోదావరి డెల్టా భూములలో వరి, కొబ్బరి పంటలు బాగా పండుతాయి.



గోదావరి డెల్టాలో "కోనసీమ" ప్రకృతి అందాలకు నిలయం.
గోదావరి పరివాహక ప్రాంతం - 3,12,812 చ.కి.మీ. ఇది భారత భూభాగంలో పదో వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం కన్నా ఎక్కువ.
నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
నాందేడ్ లో ప్రఖ్యాత సబ్ ఖండ్ గురుద్వారా ఉంది.
బాసర(ఆదిలాబాద్)లో ప్రముఖ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచల రామాలయం, మంతనిలో గౌతమీశ్వర ఆలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిలుతున్నాయి.
గోదావరీ తీరంలో నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.
రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2,600 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది.
భద్రాచలం పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విజ్జేశ్వరం సహజవాయు విద్యుత్ కేంద్రం ఉన్నాయి.
గోదావరీ తీరంలో నాందేడ్, ఔరంగాబాద్, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి.