Ticker

6/recent/ticker-posts

ప్రత్యక్ష దైవాలు | Pratyaksha Daivalu | Class 10 New Telugu | 2024 Syllabus | New Syllabus |

 ప్రత్యక్ష దైవాలు | Pratyaksha Daivalu | Class 10 New Telugu | 2024 Syllabus | New Syllabus |



https://www.myvijetha.co.in/p/pratyaksha-daivalu-class-10-new-telugu.html

Pratyaksha Daivalu | Class 10 New Telugu,ప్రత్యక్ష దైవాలు,telugu etutor,pratyaksha daivalu notes ,pratyaksha daivalu lesson,class 10 new telugu,telugu lesson class 10,ప్రత్యక్ష దైవాలు పాఠం,10th class telugu 1st lesson textbook,10th class telugu 1st lesson new syllabus,10th class telugu 1st lesson 2024,10th class telugu 1st lesson pratyaksha daivalu,pratyaksha daivalu in telugu,prathyaksha daivalu lesson,10th class new syllabus telugu textbook


అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. కోశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి ?

జ. కౌశికుని తల్లిదండ్రులు వృద్ధులు. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా కౌశికుడు వెడలిపోయాడు. కొడుకుపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వీరికి కొడుకే ఆధారం. కౌశికుడు వెళ్ళిన మరుక్షణం అతని కోసం అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి చూపు కోల్పోయారు .

2. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండటానికి కారణమేమిటి ?

జ. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్నిస్వీకరిస్తూ, నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు.

౩. గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి ?

గృహస్థుడు తల్లిని, తండ్రిని, గురువును, అగ్నిని, భగవంతుని పూజించాలి. అతిథి, అభ్యాగతులను ఆదరించాలి. భార్యా పిల్లలను (ప్రేమతో పోషించాలి. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలి. ఉన్నతంగా తీర్చిదిద్దాలి.

4. * గుర్తు గల పద్యాలకు ప్రతిపదార్దులు రాయండి 

https://www.myvijetha.co.in/p/pratyaksha-daivalu-class-10-new-telugu.html



ప్రతిపదార్దులు
ఎంతయు = చాలా
వృద్ధులు +ఐ... = ముదుసలి వారైన
తమకు = వారికి
నీవు + ఒకరుండవు. = నువ్శొక్మడివే
తెప్ప =. తరింపచేసేవాడవు
కాగ = కాగా
అతి + అంత = చాలా
'ముదంబునన్‌ = సంతోషంతో
(బ్రతుకు, = జీవిస్తున్న
తల్లిని + తండ్రిని. .= అమ్మానాన్నలను
ఉజ్జగించి = విడచి
ని:+చింతుడవు*ఐ = ఆలోచనలేనివాడవై
'సదాధ్యయనశీలత = వేదాధ్యయనం చేయాలనే స్వభావంతో
వారి + అనుజ్ఞ... = తల్లిదండ్రుల అనుమతి
లేక = లేకుండానే
ఈ +మెయిన్‌ = ఈ విధంగా
ఏకాంతము. = ఒక్కడివే
అక్కట = అయ్యో!
నీవు = నీవు
'కరంబు = చాలా
'క్రూరతన్‌ = కరినత్వంతో
వెడలితీన్ =ఇంటిని విడిచేవు 

Pratyaksha Daivalu | Class 10 New Telugu,ప్రత్యక్ష దైవాలు,telugu etutor,pratyaksha daivalu,pratyaksha daivalu lesson,class 10 new telugu,telugu lesson class 10,ప్రత్యక్ష దైవాలు పాఠం,10th class telugu 1st lesson textbook,10th class telugu 1st lesson new syllabus,10th class telugu 1st lesson 2024,10th class telugu 1st lesson pratyaksha daivalu,pratyaksha daivalu in telugu,prathyaksha daivalu lesson,10th class new syllabus telugu textbook

ఆ ) కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు, రాయండి.

 జతనంబు. మిగుల మాసములు దొమ్మిది యుద
'                                రంబునం గరము భరంబుతోడ
'భరియించి పదపడి ప్రాణనంశయ దళ
                                నొంది వుత్రునం గాంచు నెందుం  దల్లి
'తవములు యజ్ఞముల్‌ దానముల్‌ వ్రతములు,
                               'దేవతా సజ్జన సేవనములుం
గావించుం బుత్రుని గామించి జనకుండి
                                ట్లిరువుర పాటును సరియె తలంపం
'
దనయుంగని ------------నడనుండు . 

1. తమ పిల్లలనుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు ?
కోరుకుంటారు?

జ. తమ పిల్లల నుండి తల్లిదండ్రులు, కొడుకులు ధర్మాను 'రక్తులన్వాలని మరియు భక్తుడవ్వాలని కోరుకుంటారు.

2. సంతానం కొరకు తల్లి ఏ విధంగా కష్టవడుతుంది ?

జ. సంతానం కొరకు తల్లి నవమాసాలు మోస్తుంది. ప్రసవ వేదనను అనుభవించి ప్రాణాలను సైతం లెక్కచేయక కుమారుణ్ని ప్రసవిస్తుంది. ఆ సమయంలో ప్రాణం పోయినా పోవచ్చును. అనేక దానాలు, వ్రతాలు యజ్ఞాలు చేయిస్తుంది. కోరికతో కుమారుణ్ని పొందు తుంది.

3. తపముల్సు యజ్ఞములు ఎవరు ? ఎందుకు చేస్తారు ?

ఇ. తపములు, యజ్ఞములు ధర్మకార్యాలు. కొడుకు పుట్టాలని ఈ పనులు చేస్తారు.

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయంది.

'పై పద్యం ఎవరు రచించారు ?

అపరిచిత గద్యం -  ప్రశ్నలు - జవాబులు :
1 దేవనంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది ?
జ. దేవనంద తన తండ్రి కోసం కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వాలని అనుకుంది. ప్రాణదానం చేయాలనుకుంది.

'2 హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది ?
జ . దేవనంద తన తంట్రికి తన కాలేయంలో కొంత భాగొన్ని ఇవ్వడానికి సిద్ధమైనది. ఆమె చేస్తున్న త్యాగానికి సిద్ధమైనందుకు, హైకోర్టు దేవనందను ప్రశంసించింది.

3.. దేవనందకు పాస్పిటల్‌ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది ?
జ. దేవనంద చేస్తున్న సాహసానికి మెచ్చుకొని శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించింది.

4. ఓ పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జ . దేవనంద ఏ రాష్ట్రానికి చెందింది ?

Pratyaksha Daivalu | Class 10 New Telugu,ప్రత్యక్ష దైవాలు,telugu etutor,pratyaksha daivalu,pratyaksha daivalu lesson,class 10 new telugu,telugu lesson class 10,ప్రత్యక్ష దైవాలు పాఠం,10th class telugu 1st lesson textbook,10th class telugu 1st lesson new syllabus,10th class telugu 1st lesson 2024,10th class telugu 1st lesson pratyaksha daivalu,pratyaksha daivalu in telugu,prathyaksha daivalu lesson,10th class new syllabus telugu textbook,pratyaksha daivalu notes

ఈ) కింది వానికి అర్ధ సందర్భములు రాయంది.

1. వాడ  సూవె ధర్మాత్ముండు వసుధ మీద.

 పరిచయము : ఈ వాక్యము ఎర్రన  రచించిన భారతంలోని అరణ్యపర్వం 5 వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన “ప్రత్యక్షదైవాలు” అను పాఠంలోనిది.

సందర్భము : గృహస్థ ధర్మాలను వివరిస్తూ ధర్మవ్యాధుడు కౌశికునితో పల్కిన సందర్భములోనిది.

భావము : ధర్మ కార్యాలను ఆచరించిన గృహస్థుడే నిజమైన ధర్మాత్ముదని భావము.

'2. గురు జనములకు. బ్రీతిజేసెద  ననఘా!

 పరిచయము : ఈ వాక్యము ఎర్రన  రచించిన భారతంలోని అరణ్యపర్వం 5 వ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన “ప్రత్యక్షదైవాలు” అను పాఠంలోనిది.


సందర్భము : తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని కౌశికుడు, ధర్మవ్యాధునితో చెప్పిన సందర్భముల్గోనిది.

భావము : తల్లిదండ్రులను సేవించి తరిస్తాను 


ఉ ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయంది..
1, ఎర్రన ఎవరి ఆస్థాన కవి?
జ. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.
2. ధర్మవ్యాధునీ కథను ఎవరు ఎవరికి చెప్పారు ?
జ. ధర్మవ్యాధుని కథను మార్యందేయ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు.
3. ఎవరికి సేవ చేయడం తన ధర్మం అనీ కోశికుడు గ్రహించాడు?
జ. తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్యం అని కౌశికుడు గ్రహించాడు.
4. ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది ?
జ. ధర్మవ్యాధుని కథ మహాభారతం-అరణ్యపర్వం నుండి గ్రహింపబడింది.


వ్యక్తీకరణ

అ )  కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయంది..

1. ధర్మవ్యాధుడు కోశికునితో 'తల్లదంద్రుల సేవా విశిష్టతను' గురించి ఏమని చెప్పాడు  ?

జ.  ఓ కౌశిక మహర్షీ ! నీవు నన్ను సర్వజ్ఞడ వంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందదానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను. కౌశిక మహర్షిని సగౌరవంగా ధర్మవ్యాధుడు'తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. నాలుగువైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై
ధర్మవ్యాధుని తల్లిదంద్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు,మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సేవ చేస్తున్నాడు.

2. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు త మ పుత్రప్రేమను ఎలా వ్యక్తీకరించారు ?

'జ.  నాయనా ! కుమారా ! నీవంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది. నీవు పాటించే ధర్మం నిన్నురక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా.'జన్మించానే గాని దేవతలలో గొప్ప దేవతవు. అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను'ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి, తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని పలికిన తల్లిదండ్రులు తమ (ప్రేమను ధర్మవ్యాధుని దగ్గర వ్యక్తీకరించారు.

౩. గృహస్థధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు ?

జ.  ప్రతి గృహస్థు తమ తల్లిదండ్రులను పూజించాలి. - వారికి ఇష్టమైన పనులను చేయాలి. గౌరవంతో సేవ చేయాలి. అంతేకాక పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృుహస్తుడే ధర్మాత్ము డు.



ఆ ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.

1: ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్న మీ సొంత మాటల్లో రోయండి.

జ.   ఈ సృష్టిలో మన తల్లిదంద్రులే మనకు ప్రత్యక్షదైవాలు. తల్లిదంద్రుల సేవకు మించిన ధర్మం లేదని భారతం చెప్తోంది. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను నిత్యము గౌరవిస్తూ, మనన్సు, మాట, ఆచరణల చేత తల్లిదంద్రులను ప్రేమిస్తున్నాడు.ఇతని ప్రవర్తన వల్ల వారి వంశం పవిత్రమైంది. ఇతడు పాటించే ధర్మమే ఇతన్ని రక్షిస్తోంది. 
          ఇలా తల్లిదండ్రులను. సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పాడు.'మరియు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో - ప్రజల చేత గౌరవింపబడేవాడా! వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవచేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు.నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. వేరే  దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు,
గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహారపదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను.ఈ భూమిపై పై పుణ్యాన్ని కోరే గృహస్థుడు - తల్లి, తండ్రి, నను అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని పూజించి, సంతోషపరచాలి.
             అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాడు. ఆ తర్వాత కౌశిక మహర్షి చేసిన దోషాన్ని చెప్పాడు. తల్లిదండ్రులనునిర్లక్ష్యం చేస్తే వాడు వ్యర్డుడని  అని చెప్పి కౌశిక మహర్షిని జాగృత పరచి  కనువిప్పు కల్పించాడు. అందుచేత తల్లిదండ్రులు మనకు ప్రత్యక్షదైవా లు. 


Pratyaksha Daivalu | Class 10 New Telugu,ప్రత్యక్ష దైవాలు,telugu etutor,pratyaksha daivalu,pratyaksha daivalu lesson,class 10 new telugu,telugu lesson class 10,ప్రత్యక్ష దైవాలు పాఠం,10th class telugu 1st lesson textbook,10th class telugu 1st lesson new syllabus,10th class telugu 1st lesson 2024,10th class telugu 1st lesson pratyaksha daivalu,pratyaksha daivalu in telugu,prathyaksha daivalu lesson,10th class new syllabus telugu textbook


2. ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.

జ. ధర్మవ్యాధుడు ఉత్తమ కుమారుడు, తన తల్లిదండ్రులకు నిరంతరం యోగక్షేమాలను తెలుసుకుంటూ సేవ చేసే కర్మశీలుడు. మనస్సు, మాట, అచరణల చేత తల్లిదండ్రులను ప్రేమించేవాడు. అందువల్ల తన తండ్రి, కొడుకైన ధర్మవ్యాధునితో ఇలా అంటాడు “నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా,మాకేమి లోటు ఉంటుంది. నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది.
చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు. అనుమానం లేదు” అని అంటాడు. కనుకనే భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్టుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని ఆత్మ అనే అయిదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్టుడే ధర్మవ్యాధుడు. ధర్మ సూక్ష్మాలను, శాస్త్రాలను గ్రహించిన నిరాడంబర జీవి, సత్యవ్రతుడు, కల్మషంలేని మహామనీషి



Pratyaksha Daivalu | Class 10 New Telugu,ప్రత్యక్ష దైవాలు,telugu etutor,pratyaksha daivalu,pratyaksha daivalu lesson,class 10 new telugu,telugu lesson class 10,ప్రత్యక్ష దైవాలు పాఠం,10th class telugu 1st lesson textbook,10th class telugu 1st lesson new syllabus,10th class telugu 1st lesson 2024,10th class telugu 1st lesson pratyaksha daivalu,pratyaksha daivalu in telugu,prathyaksha daivalu lesson,10th class new syllabus telugu textbook,pratyaksha daivalu notes

3.  వృద్ధాశ్రమాలు పెథిగి పోతున్న నేటిరోజుల్లో తల్లిదంద్రుల సేవను మించిన ధర్మం లేదు, అనే ధర్మవ్యాధుని అభిప్రాయ

“తల్లిదండ్రుల జా మించిన ధర్మం లేదు” - అని భారతం చెప్తోంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల పాలిట ప్రత్యక్ష దైవాలు. అంతేగాక “తల్లిదండ్రులన్న - దైవ సన్నిభులురా” - అని జంధ్యాల పాపయ్యశాస్త్రి చెప్పారు. తల్లిని కష్టపెట్టకూడదు. తండ్రిని నష్టపెట్టకూడదు. నిజమైన గృహస్థుడు ధర్మాత్ముడు అవ్వాలంటే తల్లి, తండ్రి, గురువు, అగ్ని ఆత్మ ఈ అయిదుగురిని పూజించాలి. తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల గొప్ప జ్ఞానం లభిస్తుంది. ధర్మవ్యాధుడు లాగా
ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తే వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. ఇది గ్రహించిన వారుంటే వృద్ధాశ్రమాలు ఉండవు. వీటి అవసరం రాదు. కనుక బాలబాలికలారా ! ఈ పాఠం చూ చదివి ప్రతి ఒక్కరు ధర్మవ్యాధుని లాగా పుణ్యాత్ములు కావాలి.







భాష అంశాలు 

పదజాలం 

అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధాలు రాసి, సొంతవాక్యాలు రాయండి. 

1. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి.
జనకుడు = తండ్రి
'సొంతవాక్యం : తల్లిదంద్రులను పిల్లలు గౌరవించాలి.

2. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు.
అమరులు = మరణం లేనివారు
సొంతనాక్యం : దేవతలు మరణం లేనివారు.

3. చక్కని వాక్కే మనిషికి భూషణం.
భూషణం = అభరణం
'సొంతవాక్యం : స్రీలకు బంగారు అభరణాలంటే మక్కువ ఎక్కువ.

4. 'ఐ.ఏ.యస్‌. కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది.
వాంఛ = కోరిక
సొంతవాక్యం : రాము చిరకాల కోరిక కలెక్టర్‌ కావాలని.


5. అ నగరంలో హర్యాలు అకాశాన్ని తాకుతున్నాయి.
'హర్య్వాలు = మేడలు
సొంతవాక్యం : మా గ్రామంలో పెద్దపెద్ద మేదలున్నాయి.

6. మనం ఎప్పుడూ వరుల హితమునే కోరాలి.
హితము = మేలు
'సొంతవాక్యం : ఇతరులకు మేలు చేసేవాడే నిజమైన పౌరుడు.



ఆ )క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి 

1 పుత్రుడు =  కొడుకు, కుమారుడు, తనయుడు
2 వసం =. బట్ట, అందరము
3.  జనని = తల్లి, అమ్మ: అంబ
4 చక్షువు = కన్ను నయనం, నేత్రం
5. .వహ్నా = అగ్ని నిప్పు, అనలం

ఇ )కింది పదాలకు నానాల్ధాలు: రాయంది.
1.గురువు = తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు.
2.అర్థం = శబ్బార్ధము, ధనము
3.ఫలం = ప్రయోజనం, పండు
4. బుధుడు =పండితుడు, మనీషి చంద్రపుత్రుడు
5. వంశం = వెన్నుముక , గుంపు , కులము 

ఈ) కింది పదాలకు వ్యుతృత్త్యర్థాలు రాయండి.

ధర్మం. = 1) విశ్వమును ధరించునది - వేద విహితమైన కర్మ, 
                 2) ధరించునది - పుణ్యము, అచారము, స్వభావము

2 బుధుడు. = అన్నింటిని తెలిసినవాడు - విద్వాంసుడు, వేల్పు, చంద్రసుతుడు.
3. జనని = కొడుకులను కనునది --తల్లి
4 కౌశికుడు. = క్రుశికుడను రాజు మనుమడు - విశ్వామిత్రుడు
5: వసుధ = బంగారం గర్వమందు కలిగినది - భూమి



వ్యాకరణ అంశాలు 

అ) కింది పదాలను విడ దీసి, సంధి పేరు రాయండి.

1నిజంబగు. -   నిజంబు + అగు =. ఉత్వసంధి
2 మూలంబైనది.-  మూలము  + ఐనది =. ఉత్వసంధి
3.  కలదొక       -   కలదు +, ఒక =. ఉత్వసంధి
4 వేల్చునఘ-   వేల్చులు. + అనఘ = ఉత్వసంధి
క. నీవొకరుండవు --  నీవు + ఒకరుండవు =. ఉత్వసంధి

అ) కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.

1 జ్ఞాన + అర్ధంబు     =   జ్ఞానార్ధంబు _ సవర్జదీర్స సంధి
2 విజ్ఞాన + ఉన్నతి      = విజ్ఞానోన్నతి - గుణసంధి
3.  అతి + అంత = అత్యంత _ యణాదేశ సంధి
4 ధర్మ +ఆత్ముడు =  ధర్మాత్ముడు 'సవర్జదీర్ద సంధి