Ticker

6/recent/ticker-posts

International and India realated topics in July Current Affaires

 

International and India realated topics in July Current Affaires

 

అంతర్జాతీయం & ఇండియా - వరల్డ్

ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన

      ఆగ్నేయాసియా దేశాలతో (యాక్ట్ఈస్ట్పాలసీ) సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇండో-పసిఫిక్ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (మహాసాగర్విజన్‌) మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ జూలై 6 నుండి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించారు.

      మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియాలో ప్రధాని మోదీ.. జూలై 7న ఇండోనేషియా దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

      ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 14ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. క్రిటికల్మినరల్స్‌, టెక్నాలజీ, ఆహార భద్రత, సముద్ర జలాల భద్రత, ఔషధాలు, మిలిటరీ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి.

      అత్యాధునిక బ్రహ్మోస్‌’ సూపర్సోనిక్క్రూజ్క్షిపణులు, భారత్స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్టు ఎయిర్అస్త్రక్షిపణులను ఇండోనేసియాకి ఎగుమతి చేసేందుకు భారత్అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.5,600 కోట్లు. ఆపరేషన్సిందూర్లో ఈ రెండూ కీలక పాత్ర పోషించాయి.

      కీలక ఖనిజాల సరఫరా గొలుసును మరింత బలోపేతం చేసేలా.. ఇండోనేసియాలోని స్టీల్‌, నికెల్‌, రేర్ఎర్త్మ్యాగ్నెట్స్తయారీలో భారత్పెట్టుబడులు పెట్టనుంది.

      ఇండోనేసియా లోని సబాంగ్పోర్ట్ను సంయుక్తంగా నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మలక్కా జలసంధికి సమీపంలో ఉండే ఈ పోర్ట్‌.. భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైనది.

      ఇండోనేసియా అవసరాల కోసం ఎలక్ట్రానిక్ఓటింగ్యంత్రాల తయారీకి భారత్ సాంకేతిక సాయం అందించేందుకు అంగీకరించింది.

      ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు అంగీకరించాయి. ఐఐఎం-బెంగళూరు క్యాంపస్ను ఇండోనేసియాలో ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు.

మోదీకి అత్యున్నత పురస్కారం.. ప్రధాని మోదీని ఇండోనేసియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ‘బింటాంగ్ఆదిపూర్ణ రిపబ్లిక్ఆఫ్ఇండోనేసియా’ (స్టార్ఆఫ్ఇండోనేసియా) పురస్కారంతో గౌరవించింది.. ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో.. ఈ మెడల్ను మోదీకి అందజేశారు. ఇది మోదీకి దక్కిన 35వ అంతర్జాతీయ పురస్కారం.

      జూలై 7, 2026న మోదీ ఇండోనేషియా పార్లమెంట్లో ప్రసంగించారు. భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 21 విదేశీ చట్టసభల్లో/పార్లమెంట్లలో ప్రసంగించిన దేశాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.

      జకార్తాలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ మాట్లాడారు. రిఫార్మ్‌ (సంస్కరించు), పెర్ఫార్మ్‌ (పనితీరు చూపించు), ట్రాన్స్ఫార్మ్‌ (రూపాంతరీకరణ) అనేదే తమ మంత్రమని, దాని ఆధారంగానే భారత్ముందుకు వెళ్తోందన్నారు.

      సుబియాంతోతో కలిసి యోగ్యాకార్టాలో ఉన్న 10వ శతాబ్ద కాలం నాటి అతిపెద్ద హిందూ ఆలయం- ప్రంబనన్ను జూలై 8న మోదీసందర్శించారు. ఇక్కడ త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) పూజలందుకుంటారు. ఇరువురు దేశాధినేతలు కలిసి ప్రంబనన్ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు.

ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన

      భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 9న మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలోనూ పాల్గొన్నారు. ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

      అణు విద్యుదుత్పత్తికి అవసరమైన యురేనియంను వాణిజ్య ప్రాతిపదికన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. భారత్లోని అణు విద్యుత్తు ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలని 12 ఏళ్ల క్రితమే చరిత్రాత్మక పౌర అణు ఇంధన ఒప్పందంకుదిరినా అది ఇప్పుడు సాకారం కాబోతోంది.

      అణు ఇంధనాన్ని, విలువైన ఖనిజాలను సరఫరా చేయడం; పునరుత్పాదక ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం/ మరమ్మతులు సహా 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

      విద్యారంగం (భారత్లో ఆస్ట్రేలియా వర్సిటీలు): బెంగళూరులో 'ఫ్లిండర్స్ యూనివర్సిటీ' క్యాంపస్ ఏర్పాటు.

      గురుగ్రామ్లో 'విక్టోరియా యూనివర్సిటీ' క్యాంపస్ ఏర్పాటు.

      భువనేశ్వర్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మైనింగ్, మైనింగ్పరికరాలపై 'మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్' ఏర్పాటు.

      'ఆస్ట్రేలియన్ సూపర్' సంస్థ సీఈవో భారత్లో 50 కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు ₹3,312 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

      పాక్ట్స్ (PACTS) భాగస్వామ్యం: సైబర్ సెక్యూరిటీ, కీలక ఖనిజాలు, సప్లై చైన్స్ సాంకేతికత కోసం 'Partnership for Cyber Critical Technologies and Supply Chains' (PACTS) అనే కొత్త భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు ప్రకటించాయి.

      తమిళనాడు చోళుల కాలం నాటి 3 కళాఖండాల (Artifacts) పునరుద్ధరణ: ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీలో ఉన్న తమిళనాడు చోళుల కాలానికి చెందిన 3 హిందూ విగ్రహాలను భారత్కు తిరిగి అప్పగించనున్నారు.

      షణ్ముఖ కార్తికేయ విగ్రహం: 12వ శతాబ్దానికి చెందిన ఆరు తలల రాతి విగ్రహం (కుంభకోణం నాగనాథస్వామి ఆలయం నుండి దొంగిలించబడింది).

      నంది విగ్రహం: 13-16 శతాబ్దాల నాటి ఏకశిలా విగ్రహం (తంజావూరు కైలాసనాథన్ ఆలయానికి చెందినది).

      భద్రకాళి కాంస్య త్రిశూలం: చోళుల కాలం నాటి లోహ త్రిశూలం.

      మెల్బోర్న్ మీట్స్ మోదీ: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన 3వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పీఎం మోదీ పాల్గొన్నారు.

      మార్వెల్ స్టేడియంలో జరిగిన భారీ ప్రవాస భారతీయుల సదస్సులో (దాదాపు 30 వేల మంది పాల్గొన్నారు) మోదీ ప్రసంగిస్తూ.. చిప్ల నుండి షిప్ల వరకు భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతోందని పేర్కొన్నారు.

      మోదీ చమత్కారం: ఇరుదేశాల బంధాన్ని క్రికెట్ భాషతో పోలుస్తూ.. "మన కార్యాచరణ వన్డే లాంటిది (స్పష్టమైన లక్ష్యం), నిర్ణయాలు టీ20 లాంటివి (వేగం), భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ లాంటిది (స్థిరత్వం)" అని వ్యాఖ్యానించారు.

      NOTE : 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్య సాధనకు వీలుగా ఆస్ట్రేలియాతో తాజా ఒప్పందం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారత్లో 7 చోట్ల 24 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వాటి స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు.

ప్రధాని మోడీ న్యూజిలాండ్ పర్యటన

      భారత ప్రధాని నరేంద్ర మోదీ 2026 జూలై 10,11 తేదీలలో న్యూజిలాండ్లో రెండు రోజుల పాటు చారిత్రాత్మక పర్యటన చేశారు. గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ సందర్శించడం ఇదే తొలిసారి.

      న్యూజిలాండ్కు చెందిన 'మవోరి' (Maori) గిరిజన తెగ ప్రజలు ప్రధాని మోదీకి సాంప్రదాయ 'హాకా' (Haka) నృత్యంతో స్వాగతం పలికారు.

      న్యూజిలాండ్ప్రధాని క్రిస్టోఫర్లక్సాన్తో జరిపిన చర్చల్లో రక్షణ (Defense), వాణిజ్యం (Trade), సముద్రయాన భద్రత (Maritime Security) రంగాలలో ఇరుదేశాల మధ్య 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. 18 నిర్ణయాలు వెలువడ్డాయి.

      వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రత్యేక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో వ్యవసాయ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కోసం రెండు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' సంస్థల్ని ఏర్పాటు చేయనున్నారు.

      పశుసంవర్ధక, డెయిరీ రంగాల్లో సాంకేతిక సహకారం కోసం ఒప్పందం కుదిరింది.

      హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ మెడిసిన్ అభివృద్ధికి జాయింట్ యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు.

      గుజరాత్లోని లోథల్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (NMHC), న్యూజిలాండ్ మారిటైమ్ మ్యూజియం సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.

      భారత్-న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన నేపథ్యంలో, ఇరు దేశాల ప్రధానులు'ఇండియా-న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ రోడ్మ్యాప్ 2030'ని ఆమోదించారు.  దీని ప్రకారం  ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 2030 నాటికి 700 కోట్ల న్యూజిలాండ్డాలర్లకు (సుమారు రూ.35,000 కోట్లకు) చేర్చాలని లక్ష్యంగా విధించుకున్నాయి.

      భారత్కు న్యూజిలాండ్ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో 57 శాతం ఉత్పత్తుల మీద ఇకపై ఎలాంటి సుంకాలు ఉండవు.

      ఆక్లాండ్లో నిర్వహించిన 'కియా ఓరా మోదీ' (Kia Ora Modi) కార్యక్రమంలో దాదాపు 10,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము 3 ఐరోపా దేశాల పర్యటన

      భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 19 నుంచి 25 వరకు తూర్పు యూరప్లోని మూడు దేశాలలోమోల్డోవా (Moldova), ఉత్తర మాసిడోనియా (North Macedonia), మరియు రొమేనియా (Romania) లలో చారిత్రాత్మక అధికారిక పర్యటన చేపట్టారు.

      మోల్డోవా మరియు ఉత్తర మాసిడోనియా దేశాలను ఒక భారత రాష్ట్రపతి సందర్శించడం చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే రొమేనియాలో మూడు దశాబ్దాల (30 ఏళ్ల) విరామం తర్వాత భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే ప్రథమం.

మోల్డోవా పర్యటన (జులై 20)

      అధ్యక్షురాలు: మైయా సందు (Maia Sandu) ఆహ్వానం మేరకు పర్యటించారు.

      చర్చలు: మోల్డోవా పార్లమెంట్ స్పీకర్ ఇగోర్ గ్రోసు (Igor Grosu) తో సమావేశమయ్యారు.

      సహకార రంగాలు: వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్, ఐటీ (IT) మరియు విద్యారంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిపారు. Note: మాల్డోవా రాజధాని చిసినౌ.

ఉత్తర మాసిడోనియా పర్యటన (జులై 21 - 22)

      అధ్యక్షురాలు: గోర్దానా సిల్జానోవ్స్కా-దావ్కోవా (Gordana Siljanovska-Davkova) ఆహ్వానం మేరకు సందర్శించారు.

      స్కోప్జే (Skopje) నగరంలో ప్రధాని క్రిస్టిజన్ మిక్కోస్కీతో చర్చలు మరియు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.

      నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జె (Skopje) మ్యూజియంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మదర్ తెరెసా స్మారక కేంద్రాన్ని సందర్శించారు. Note : నార్త్ మెసిడోనియా' రాజధాని స్కోప్జే

రొమేనియా పర్యటన (జులై 23 - 25)

      అధ్యక్షుడు: నికుషోర్ దాన్ (Nicușor Dan) ఆహ్వానం మేరకు పర్యటించారు.

      రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రొమేనియా లోని బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ 'డాక్టర్ ఆనర్ కాసా' (Honorary Doctorate) ప్రధానం చేసింది.

      రాబోయే 3 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని (Bilateral Trade) రెట్టింపు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

      3 కీలక ఒప్పందాలు (MoUs) కుదిరాయి: సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, విద్యా, సాంస్కృతిక సంబంధాలు.

      Note: రొమేనియా రాజధాని బుకా రెస్ట్.

భారత్, మాల్డోవాల ఒప్పందం

      వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, మాల్డోవాల మధ్య ఒప్పందం కుదిరింది.

      రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తూర్పు ఐరోపా దేశమైన మాల్డోవా పర్యటన సందర్భంగా ఇరుదేశాలు ఆర్థిక సహకారాన్ని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించాయి.

      తమ దేశ సందర్శనకు వచ్చిన తొలి భారత రాష్ట్రపతి అయిన ముర్ముతో మాల్డోవా అధ్యక్షురాలు మయ్యా సందు ద్వైపాక్షిక సహకారానికి అవకాశం ఉన్న పలు విషయాలపై చర్చలు జరిపారు.

భారత్ & జపాన్ చర్చలు

      జపాన్ చరిత్ర లోనే మొట్ట మొదటి మహిళా ప్రధానమంత్రి సనై తకైచి (Sanae Takaichi) జూలై 1 నుండి జూలై 3 వరకు భారతదేశంలో పర్యటించారు.

      భారత్‌-జపాన్‌ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు(న్యూ ఢిల్లీ) కోసం భారత్కు వచ్చిన జపాన్ప్రధాని సనాయె తకాయిచి జూలై 2 మోదీతో హైదరాబాద్హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

      ఈ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం మరియు సాంకేతిక రంగాలలో సుమారు 129 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.

      కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్లలోనూ పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.

      దేశంలో వెయ్యి బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల కర్మాగారాలు నెలకొల్పడంలో జపాన్సహకరిస్తుంది. రాబోయే పదేళ్లలో 10 లక్షల కోట్ల యెన్ (సుమారు రూ.5.93 లక్షల కోట్ల) పెట్టుబడుల్ని జపాన్నుంచి రాబట్టి, భారత్లో ఆ దేశ కంపెనీలు రెట్టింపయ్యేలా చూడాలనేది లక్ష్యం.

      నేవల్రేడియో యాంటెన్నా ప్రాజెక్టు రెండు దేశాల మధ్య తొలి రక్షణ భాగస్వామ్య అధ్యాయంగా నిలవనుందని చెప్పారు. ఔషధ రంగం, వైద్య పరికరాలు, బయోటెక్రంగాల్లోనూ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

      17 కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా సరఫరా వ్యవస్థను, సాంకేతిక సామర్థ్యాన్ని జపాన్పెంచుకోనుందని తకాయిచి చెప్పారు. ఆమెను తన చెల్లెలుగా మోదీ అభివర్ణించారు.

      హర్యానా లోని ఖార్ఖోడా (Kharkhoda) లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నిర్మించిన 4వ కార్ల తయారీ కేంద్రాన్ని ఇరు దేశాల ప్రధానులు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

      భారత నౌకాదళం (Indian Navy) కోసం సరికొత్త 'యూనికార్న్ మాస్ట్' (NORA-50) డిఫెన్స్ సిస్టమ్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశం మరియు జపాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

      Note: 15వ ఇండియా-జపాన్ వార్షిక సదస్సు (2025) జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది.

ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్ (Year of Shared Horizons)

      భారత్ మరియు జపాన్ దేశాలు 2027 వ సంవత్సరాన్ని "ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్" గా జరుపుకోనున్నట్లు ప్రకటించాయి.

      నేపథ్యం: 2027 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు (Diplomatic Relations) ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

      ముఖ్య కార్యక్రమాలు: ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి 'స్పోర్ట్ 75' (Sport 75) అనే కార్యక్రమాన్ని, అలాగే బౌద్ధ టూరిజం (Buddhist Tourism) ను కూడా ప్రమోట్ చేయనున్నారు.

      Note : భారత్ - ఫ్రాన్స్ దేశాలు 2026 సంవత్సరాన్ని "ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్" గా ప్రకటించాయి).

International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD

మానస్ & మహాభారతంఅంతర్జాతీయ అధ్యయన కేంద్రం ప్రారంభం

      కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ (Bishkek) లో 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషనల్ స్టడీస్: మానస్ అండ్ మహాభారత్' ప్రారంభమైంది.

      దీనిని న్యూఢిల్లీ లోని 'సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్' మరియు కిర్గిస్తాన్ 'మానస్ నేషనల్ అకాడమీ' కలిసి ఏర్పాటు చేశాయి.

      లక్ష్యం: భారతదేశపు మహాకావ్యం 'మహా భారతం', కిర్గిజిస్తాన్ జాతీయ మహా కావ్యం 'మానస్' (Manas) లపై సంయుక్తంగా పరిశోధనలు చేయడం మరియు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం.

      మానస్ మహాకావ్యం: కిర్గిజిస్తాన్కు చెందిన వీరయోధుడు 'మానస్' జీవితం ఆధారంగా రూపొందింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మౌఖిక మహాకావ్యం (Longest oral epic) గా గుర్తింపు పొందింది.

థాయ్లాండ్లో 2000 ఏళ్ల నాటి బ్రాహ్మీ లిపి బంగారు ఉంగరాలు

      థాయ్లాండ్ పశ్చిమ ప్రాంతంలోని 'డాన్ యైథాంగ్' (Don Yai Thong) పురాతత్వ తవ్వకాల ప్రదేశంలో 2000 సంవత్సరాల క్రితం నాటి భారతీయ బ్రాహ్మీ లిపి (Brahmi Script) చెక్కబడిన బంగారు ఉంగరాలు లభ్యమయ్యాయి.

      దీనిపై "పుసరఖితాస" (Pusarakhitas) అని రాసి ఉంది, అనగా 'పుష్య నక్షత్రం లేదా పుష్యుడి ద్వారా రక్షించబడినది' అని అర్థం.

      పూర్వకాలంలో భారతదేశం మరియు ఆగ్నేయాసియా దేశాల మధ్య జరిగిన వర్తక వాణిజ్యాలకు ఇది బలమైన నిదర్శనం.

పాకిస్తాన్కు యునెస్కో (UNESCO) హెచ్చరిక

      పాకిస్తాన్ లోని చారిత్రాత్మక వారసత్వ నగరమైన తక్షశిల (Taxila) లో పాత నిర్మాణాలను కూల్చివేసి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తుండటంపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

      ఈ పనులను తక్షణమే ఆపకపోతే తక్షశిలను 'ప్రమాదంలో ఉన్న వారసత్వ కట్టడాల జాబితా' (Endangered/Red List) లో చేరుస్తామని హెచ్చరించింది.

      Note: క్రీ.పూ 6వ శతాబ్దం నుండి క్రీ. 5వ శతాబ్దం వరకు గాంధార కాలంలో విద్యా, సాంస్కృతిక కేంద్రంగా వికసించిన తక్షశిలను 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ సింధు నది తీరాన ఉంది.

      యునెస్కో స్థాపన: 16 నవంబర్, 1945. HQ: పారిస్, ఫ్రాన్స్.

      ప్రస్తుత యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఎనాని (Khalid el-Anany) (ఈజిప్ట్ - తొలి అరబ్ వ్యక్తి).

      ప్రస్తుతం భారతదేశంలో 44 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఉన్నాయి (44వది: మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్).

      అవ్యక్త సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలు (Intangible Cultural Heritage List): మానవాళి సాంస్కృతిక సంరక్షణలో భాగంగా భారతదేశం నుండి 16 ఉత్సవాలకు/కళలకు ఈ జాబితాలో చోటు దక్కింది. 16వ ఉత్సవం: దీపావళి పండుగ.

      భారతదేశం నుండి ఇప్పటివరకు 9 నగరాలను యునెస్కో సృజనాత్మక నగరాలుగా గుర్తించింది.

      భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉండగా, వాటిలో 13 రిజర్వులను యునెస్కో తన జాబితాలో గుర్తించింది.

International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD

I 2 SEA ప్రాజెక్ట్ (I 2 SEA Project - India to South East Asia)

      పశ్చిమాసియా సంక్షోభం (హోర్ముజ్ జలసంధి వివాదం) కారణంగా అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా I2C సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు.

      అర్థం: India TO South East Asia (I2 SEA).

      సింగపూర్కు చెందిన లైట్ స్టార్మ్ (Lightstorm) సంస్థ నేతృత్వంలో మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి.

      సింగపూర్, మలేషియా నుండి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, తమిళనాడులోని తూర్పు చెన్నై తీరాలకు 3,600 కిలోమీటర్ల మేర సముద్రగర్భ కేబుల్ వేస్తారు. అక్కడి నుండి ముంబై, హైదరాబాద్ డేటా సెంటర్లకు అనుసంధానిస్తారు.

      ఈ ప్రాజెక్టు 2029 చివరి నాటికి (4వ త్రైమాసికం) పూర్తి కానుంది.

ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ (ACTI)

      భారతదేశం, ఆస్ట్రేలియా మరియు కెనడా దేశాలు సంయుక్తంగా 'అసిటీ' (ACTI - Australia Canada India Technology and Innovation Partnership) భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రారంభించాయి.

      ఈ భాగస్వామ్యం ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్, క్రిటికల్ మినరల్స్ (నికెల్, లిథియం, గ్రాఫైట్ వంటివి) సప్లై చైన్ను బలోపేతం చేయడం మరియు డీప్ టెక్నాలజీ రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉద్దేశించబడింది.

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (WAICO)

      16 జూలై 2026 చైనా ప్రారంభించింది.

      ప్రధాన కార్యాలయం (Headquarters): షాంఘై, చైనా

      ప్రారంభ వేదిక: షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు (WAIC - 2026) లో ఈ ఒప్పందం జరిగింది.

      స్థాపక సభ్యదేశాలు (Founding Members): 29 దేశాలు (చైనా, రష్యా, పాకిస్తాన్, ఇండోనేషియా, బ్రెజిల్, ఖజకిస్తాన్ వంటి ప్రధానంగా గ్లోబల్ సౌత్ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు సంతకం చేశాయి).

International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD

ప్రాజెక్ట్ యూనికార్న్ (Project UNICORN)

      భారత నౌకాదళ యుద్ధనౌకల సామర్థ్యాన్ని మరియు 'స్టెల్త్' (శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండే) సాంకేతికతను పెంచడానికి భారత్ మరియు జపాన్ దేశాల మధ్య రూపుదిద్దుకున్న చారిత్రాత్మక ఉమ్మడి రక్షణ ప్రాజెక్ట్.

      ఇది భారత్ - జపాన్ దేశాల మధ్య జరిగిన తొలి రక్షణ సాంకేతిక ఒప్పందం (First Defense Cooperation).

      UNICORN అనగా Unified Complex Radio Antenna.

      దీనిని యుద్ధనౌకల యొక్క పైభాగంలో (Integrated Mast) అమర్చుతారు. ఓడపై వేర్వేరు చోట్ల ఉండే రకరకాల కమ్యూనికేషన్ యాంటెన్నాలను ఒకే కాంపాక్ట్, సమీకృత నిర్మాణం (Single Integrated Mast Structure) కిందకి తీసుకువస్తుంది.

      భాగస్వామ్యులు : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) & భారత్ కు చెందిన NEC కార్పొరేషన్, యోకోహామా రబ్బర్, సాంపా కొగ్యో KK

      న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో జపాన్ ప్రధాన మంత్రి సనాయి తకైచి సమక్షంలో దీనిపై సంతకాలు జరిగాయి.

International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD

భారత్ - సౌదీ అరేబియా జలవనరుల ఒప్పందం

      జలవనరుల రంగంలో (Water Resources Sector) సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.

      సౌదీ అరేబియాలోని జెడ్డా (Jeddah) నగరంలో జరిగిన "సౌదీ వాటర్ వీక్" అంతర్జాతీయ సదస్సులో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD

మొంగ్లా పోర్ట్ (Mongla Port) వివాదం - బంగ్లాదేశ్

      బంగ్లాదేశ్లోని వ్యూహాత్మక మొంగ్లా పోర్ట్ (Mongla Port) వద్ద ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (Economic Zone) ఏర్పాటు కోసం బంగ్లాదేశ్ మరియు చైనా దేశాల మధ్య ఒప్పందం కుదిరింది

      వాస్తవానికి ఈ ఎకనామిక్ జోన్ను భారత్-బంగ్లాదేశ్ భాగస్వామ్యంతో నిర్మించాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక, పాత ఒప్పందాన్ని రద్దు చేసి ఈ ప్రాజెక్టును చైనాకు అప్పగించారు.

      ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రేవుకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల, ఇక్కడ చైనా ఆధిపత్యం పెరిగితే భవిష్యత్తులో బంగాళాఖాతంలో భారత్కు రక్షణ పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

భారత్ - యూకే (UK) వాణిజ్య ఒప్పందం (CETA) అమలు

      భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA - Comprehensive Economic Trade Agreement) జూలై 15, 2026 నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది.

      ఈ ఒప్పందంపై జూలై 25, 2025న సంతకాలు జరిగాయి. దీని ప్రకారం భారతదేశం నుండి యూకేకి ఎగుమతి అయ్యే 99% వస్తువులపై ఎలాంటి సుంకాలు (Zero Tax) ఉండవు.

మిసైల్ డిఫెన్స్ కొయలిషన్

      శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణుల దాడి నుండి రక్షణ కోసం ఉక్రెయిన్ సహా మొత్తం 10 ఐరోపా దేశాలు ఒక బలమైన రక్షణ కూటమిగా పారిస్ వేదికగా ఏర్పడ్డాయి.

      10 దేశాలు: ఉక్రెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్ మరియు బ్రిటన్.

      దీనికి "Integrated Anti-Ballistic Missile Coalition" అని పేరు పెట్టారు.

International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD

సంక్షిప్త సమాచారం

      భారత్, ఇజ్రాయెల్ మధ్య సురక్షిత, స్థిరమైన పెట్టుబడి వాతావరణానికి వీలు కల్పించే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం జూలై 4న అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది.

      సరిహద్దు పెట్టుబడులను (Cross Border Investments) ప్రోత్సహించడానికి గుజరాత్లోని గిఫ్ట్ సిటీ, వియత్నాంకు చెందిన దానంగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్' తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Note: గిఫ్ట్ సిటీ (GIFT City) అనేది గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (IFSC).

      తూర్పు చైనా సముద్ర (East China Sea) ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణమండల తుఫాను 'టైఫూన్ బావి' జపాన్ (సకిషిమా దీవులు) మరియు తైవాన్ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫానుకు 'బావి' అనే పేరును వియత్నాం దేశం సూచించింది.

      ఇటీవల తీవ్రంగా బద్దలై వార్తల్లో నిలిచిన 'టాల్ అగ్నిపర్వతం' ఫిలిప్పీన్స్ దేశంలో ఉంది.

      118 సంవత్సరాల తర్వాత జిబ్రాల్టర్ సరిహద్దుల్లో స్పెయిన్ మరియు ఇతర యూరోపియన్ దేశాల మధ్య జూలై 15, 2026 నుండి ఎలాంటి ఇమ్మిగ్రేషన్ తనిఖీలు లేకుండా స్వేచ్ఛా రాకపోకలకు అనుమతినిచ్చారు.

      2028-29 సంవత్సరాలకు గాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నిక కావడం కోసం న్యూయార్క్లో శాంతి క్యాంపెయిన్  కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్  ప్రారంభించారు.

SHANTI అంటే: Securing Holistic Advancement through Norms, Trust and Integrity.  భారతదేశం ఇప్పటివరకు 8 సార్లు UNSC తాత్కాలిక సభ్యదేశంగా సేవలందించింది. చివరిసారిగా 2021-22 లో పనిచేసింది.

UNSC లో 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.

      నయం చేయలేని రుగ్మతలతో సతమతమవుతున్న పెద్దలు అనాయాస మరణం(బాధలేని మరణాన్ని (Euthanasia / Assisted Dying) పొందేందుకు వీలు కల్పించే బిల్లుకు ఫ్రాన్స్ జాతీయ చట్టసభ 2026, జులై 15న తుది ఆమోదం తెలిపింది.

      15 ఏళ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలను వాడటంపై నిషేధం విధించే బిల్లుకు 2026, జులై 21ఫ్రాన్స్ ఆమోదం తెలిపింది. ఐరోపా సమాఖ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా ఫ్రాన్స్నిలిచింది.

      పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం ఇచ్చేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఈ క్రమంలో యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సౌదీ అరేబియా సమకూర్చుకునేందుకు ఆ దేశంతో 30 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఒప్పందానికి ట్రంప్ఆమోదం తెలిపారు.

      లింపియాధుర, లిపులేఖ్‌, కాలాపానీలను నేపాల్లో భాగాలుగా చూపే మ్యాప్ను కొత్తగా రూపొందించిన రూపాయి నాణెంపై ముద్రించనున్నట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు వెల్లడించింది. ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్వాదిస్తుండగా.. ఇవి ఉత్తరాఖండ్లో భాగమని భారత్చెబుతోంది.2020 మేలో కె.పి.ఓలీ నేతృత్వంలోని నేపాల్ప్రభుత్వం ఈ ప్రాంతాలను తన అధికారిక మ్యాప్లో చేర్చుకుంది.

      తీవ్రమైన అటవీ కార్చిచ్చుల (Wildfires) కారణంగా స్పెయిన్ ప్రభుత్వం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని (National Emergency) ప్రకటించింది.

      ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)  గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న) దేశాల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ఆ సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు వెనిజులా ఐక్యరాజ్యసమితికి తెలిపింది. Note : ICC  : ఇది UN కింద పనిచేసే సంస్థ కాదు; 1998 'రోమ్ స్టాట్యూట్' ద్వారా ఏర్పడి, జులై 1, 2002 నుండి అమల్లోకి వచ్చింది. HQ ది హేగ్ (నెదర్లాండ్స్). భారత్, అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్ ఐసీసీలో సభ్యదేశాలు కావు.

  • International Current Affairs,  India Current Affairs  ,  Current Affairs 2026  ,  Latest Current Affairs ,Daily Current Affairs,  Monthly Current Affairs, National and International Current Affairs,  Current , Affairs Today,  India and World Current Affairs,  Current Affairs PD